వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు: దత్తాత్రేయ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు కె. చంద్రశేఖర్ రావు, ఎ. నరేంద్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాలరాస్తున్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. అపాయింట్మెంటే ఇవ్వని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తుందా? అని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు.
మంత్రి పదవులకు రాజీనామా చేసి యుపిఎ నుంచి బయటకు రావాలని ఆయన కెసిఆర్, నరేంద్రలకు సూచించారు. ప్రధాని మన్మోహన్ సింగ్, రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అవమానిస్తున్నా తెరాస నేతలు వారిని పట్టుకుని వేలాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Story first published: Thursday, May 25, 2006, 23:53 [IST]