వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమకు లక్ష కోట్ల నష్టపరిహారం: టిజి డిమాండ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే రాయలసీమకు లక్ష కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని రాయలసీమ ఐక్య వేదిక నాయకుడు టి.జి. వెంకటేష్‌ కేంద్ర మంత్రి దయానిధి మారన్‌ను కోరారు. తెలంగాణపై ఏర్పాటయిన ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వంలోని యుపిఎ ఉపసంఘం సభ్యుడు దయానిధి మారన్‌ను ఆయన గురువారంనాడు కలిసి తన వాదనను వినిపించారు. రాయలసీమకు లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటిస్తే తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తామని ఆయన చెప్పారు.

కొత్త రాష్ట్ర ఏర్పాటు కావడానికి శాసనసభ తీర్మానం చేయాల్సి వుంటుందని ఆయన చెప్పారు. హైదరాబాద్‌ను దేశం రెండో రాజధానిగా ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ను గ్రేటర్‌ హైదరాబాద్‌గా మార్చి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని కూడా ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X