వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌, నరేంద్ర బయటకు వస్తేనే తెలంగాణ: ఉమ

By Staff
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు కె. చంద్రశేఖర రావు, ఎ. నరేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసి యుపిఎ నుంచి బయటకు వస్తేనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని భారతీయ జనశక్తి నాయకురాలు ఉమాభారతి అన్నారు. ఆమె రాష్ట్ర పర్యటనలో భాగంగా గురువారంనాడు నెల్లూరు రోడ్‌ షో నిర్వహించారు. వచ్చే మూడేళ్లలో బిజెపి బిజెయస్‌గా మారనుందని, జనసంఘ్‌ బిజెపిగా మారినట్లు బిజెపి భారతీయ జనశక్తిగా మారుతుందని ఆమె అన్నారు.

బిజెపితో తనకు సైద్ధాంతిక విభేదాలు లేవని, బిజెపిలోని కొందరు నాయకులతోనే విభేదాలున్నాయని ఆమె చెప్పారు. వామపక్షాల సైద్ధాంతిక వైఖరి దేశ సమగ్రతకు ప్రమాదకరమని, తమ ప్రథమ సైద్ధాంతిక శత్రువు వామపక్షాలేనని ఆమె అన్నారు. బిజెపి నుంచి బిహిష్కరణకు గురైన ఉమాభారతి భారతీయ జనశక్తి పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X