వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహానాడులో హరికృష్ణ ఆకర్షణ
రాజమండ్రి: రాజమండ్రిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో హరికృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శుక్రవారం సాయంత్రమే రాజమండ్రి చేరుకున్న హరికృష్ణ మహానాడు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఎన్టీఆర్ అభిమానులు, సీనియర్ కార్యకర్తలు ఆయనను పలకరించి వెళ్తున్నారు. పార్టీలో ప్రస్తుతం తనకు ఎటువంటి పదవి లేదని, ఏ పదవి ఇచ్చినా తీసుకుని పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. మహానాడులో మాట్లాడుతూ ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన చారిత్రక నేపధ్యాన్ని గుర్తు చేశారు.
Comments
Story first published: Saturday, May 27, 2006, 23:53 [IST]