వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇండోనేషియా భూకంపంలో 2,700 మంది మృతి
జకార్తా: ఇండోనేషియాలో శనివారం సంభవించిన తీవ్ర భూకంపంలో 2,700 మందికిపైగా మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. ఇది సునామీ కావచ్చునని వదంతులు వెలువడడంతో ప్రజలు భయాందోళనలతో భీతిల్లిపోయారు. ఎక్కడికక్కడే ప్రజలు తమకు సంబంధించిన అన్నిటినీ వదులుకుని సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. భూమి కంపించిన కొంత సేపటికి సమీపంలోని కొండ ప్రాంతంనుంచి పెద్దఎత్తున పొగ కమ్ముకువచ్చింది. దీనినిబట్టి ఏదైనా అగ్ని పర్వతం బద్దలై ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంకా వివరాలు అందవలసి ఉంది.
Comments
Story first published: Saturday, May 27, 2006, 23:53 [IST]