వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలీసులు ప్రభుత్వ ప్రతిష్ట పెంచాలి: వైయస్
హైదరాబాద్: ప్రభుత్వానికి మచ్చ తేవద్దని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి పోలీసులకు సూచించారు. రాష్ట్రంలోని పోలీసు స్టేసన్లను అనుసంధానం చేసే డేటా సెంటర్ను ఆయన సోమవారంనాడు ప్రారంభించారు. పోలీసులు ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా వ్యవహరించాలని, ప్రజలకు సేవ చేయడానికి అవసరమైన సదుపాయాలను పోలీసులకు కల్పిస్తామని ఆయన అన్నారు. పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాలని కూడా ఆయన పోలీసులకు ఉద్బోధించారు.
రాష్ట్ర పోలీసులు దేశంలోనే ఆదర్శంగా నిలవాలని ఆయన ఆశించారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు ప్రశంసనీయంగా ఉందని ఆయన అన్నారు. పోలీసుల పనితీరు పరిపాలనపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి కె. జానారెడ్డి, పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్ జిత్ సేన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Story first published: Monday, May 29, 2006, 23:53 [IST]