వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దోపిడీ దొంగల బీభత్సం: గుమస్తా కాల్చివేత
విశాఖపట్నం: విశాఖపట్నం శివార్లలోని లంకెలపాలెంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒక వ్యక్తిని చంపి, మిగతా వారిని బెదిరించి రెండు పెట్రోలు బంకులను దోచుకున్నారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ముసుగు దొంగలు పెట్రోలు బంకుల దోపిడీకి వచ్చి ఉద్యోగులను బెదిరించారు. తాళాలు ఇవ్వడానికి నిరాకరించిన క్యాషియర్ దుర్గారావును కాల్చి చంపారు.
మిగతా వారిని బెదిరించి నగదు, ఉద్యోగుల వస్తువులు దోచుకుని వెళ్లిపోయారు. దాదాపు లక్ష రూపాయల సొత్తును వాళ్లు దోచుకెళ్లినట్లు అంచనా. ఈ దోపిడీలో ఆరుగురు ముసుగు దొంగలు పాల్గొన్నట్లు చెబుతున్నారు. దుర్గారావు శవానికి విశాఖపట్నంలోని కె.జి.హెచ్.లో పోస్టుమార్టం నిర్వహించారు. దుర్గారావు శవాన్ని బంధువులకు అప్పగించారు. విశాఖపట్నంలో ఇటీవలి కాలంలో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. వీరు పోలీసులకు సవాల్గా నిలిచారు.
Comments
Story first published: Tuesday, May 30, 2006, 23:53 [IST]