వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవాదాయ భూముల స్వాధీనంపై హైకోర్టు స్టే

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఇందిరమ్మ పథకానికి దేవాదాయ భూములు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు మంగళవారం స్టే ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ఆర్చక సమాఖ్య హైకోర్టు పిటిషన్‌ దాఖలు చేసింది. ఇందిరమ్మ పథకం కింద పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి దేవాదాయ భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కలెక్టర్లు వేయి ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నారు. దేవాలయాలకు భక్తులు దానంగా ఇచ్చిన లక్ష్యం ప్రభుత్వ నిర్ణయం వల్ల దెబ్బ తింటుందని, ఇష్ట నైవేద్యాలకు, మహా నైవేద్యాలకు ఆ భూములను ఉద్దేశించారని అర్చక సమాఖ్య వాదిస్తోంది. ఉభయ గోదావరి జిల్లా కలెక్టర్లకు కోర్టు ధిక్కారం కింద నోటీసులు జారీ అయ్యాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X