వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎసి వాహనంలో కోర్టుకు మొద్దు శీను

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన జూలకంటి శ్రీనివాసరెడ్డి అలియాస్‌ మొద్దు శీను పట్ల జైలు సిబ్బంది తమ ప్రేమను ప్రదర్శించుకున్నారు. మొద్దు శీనును ఎసి వాహనంలో మొద్దు శీనును రంగారెడ్డి జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా మొద్దు శీనును ఎసి వాహనంలో మొద్దు శీనును జైలు సిబ్బంది తీసుకురావడం వివాదాస్పదంగా మారింది. మాజీ నక్సలైట్‌ వెంకటరెడ్డి హత్య కేసులో మొద్దు శీనును పోలీసులు గురువారం రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరు పరిచారు.

భార్యాబిడ్డలతో మాట్లాడడానికి కోర్టు మొద్దు శీనుకు పది నిమిషాల పాటు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన భార్యాభర్తలతో గడిపాడు. ఇదిలావుంటే, వచ్చే పంచాయతీ ఎన్నికల్లో మొద్దు శీను భార్య లక్ష్మీరాజ్యం పోటీ చేసే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ తరఫున ఆమె పోటీ చేయవచ్చునని ప్రచారం జరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X