వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

3 ప్రధాన నగరాల్లో దివ్యక్షేత్రాలు: టిటిడి

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి: హైదరాబాద్‌, బెంగుళూర్‌, చెన్నైలలో శ్రీవారి దివ్య క్షేత్రాలను ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి నిర్ణయించింది. ఈ దివ్య క్షేత్రాల్లో యేటా కల్యాణోత్సవాలు నిర్వహించాలని కూడా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. రామకృష్ణ మఠం ద్వారా అనాథల సేవా కార్యక్రమాలు చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకుంది. టిటిడి చైర్మన్‌ టి. సుబ్బిరామిరెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తిరుపతిలో ఆరు నెలల్లో వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు సాకారమవుతుందని టిటిడి పాలక మండలి విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రతి శ్రావణ పౌర్ణమినాడు టిటిడి కల్యాణ మండపాల్లో ఉత్సవాలు నిర్వహించాలని కూడా పాలక మండలి నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని వంద దేవాలయాల్లో వంద దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాల కోసం రెండు వేల రూపాయలేసి ఇవ్వాలని టిటిడి పాలక మండలి నిర్ణయం తీసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X