వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య
మెదక్: మెదక్ జిల్లాలో పాతకక్షలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని హత్య చేశారు. వెంకటరమణ అనే వ్యక్తిని, ఆయన కొడుకును, భార్యను ఆయన సోదరులే హత్య చేశారు. పైకిల్పై వస్తున్న వెంకటరమణ అనే వ్యక్తిని ఆయన సోదరులు మల్లేష్, బీరయ్య హత్య చేశారు. అనంతరం వెంకటరమణ కొడుకును, భార్యను చంపేశారు. హత్య అనంతరం వారిద్దరు పోలీసులకు లొంగిపోయారు.
వెంకటరమణ గతంలో ఒకసారి తనపై దాడి చేశాడని బీరయ్య చెబుతున్నాడు. తమను ఎప్పుడైనా హత్య చేయవచ్చుననే భయంతో తాము వెంకటరమణను హత్య చేశామని వారంటున్నారు.
Comments
Story first published: Friday, June 2, 2006, 23:53 [IST]