వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గంగూలీకి శరద్ వర్గం అన్యాయం: దాల్మియా
కోల్కత్తా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీని కావాలనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడు శరద్ పవార్ వర్గం జట్టుకు దూరం పెడుతోందని బిసిసిఐ మాజీ అధ్యక్షుడు జగ్మోన్ దాల్మియా విమర్శించారు. గంగూలీని అంతర్జాతీయ క్రికెట్ జట్టులోకి తీసుకోకపోవడంపై కనీసం వివరణ కూడా ఇవ్వలేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
మరో మూడేళ్ల పాటు ఆడే సత్తా గంగూలీలో ఉందని ఆయన అన్నారు. తాను బిసిసిఐ పగ్గాలు చేపడితే గంగూలీ తిరిగి జట్టులోకి వస్తాడని ఆయన చెప్పారు. భారత జట్టు కోచ్ గ్రెగ్ చాపెల్ ప్రయోగాలు మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దాల్మియాపై శరద్పవార్ వర్గం ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు చేసింది.
Comments
Story first published: Friday, June 2, 2006, 23:53 [IST]