వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సభ: హైదరాబాద్‌కు చేరిన రాజ్‌నాథ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర శాఖ మహబూబ్‌నగర్‌లో తెలంగాణ విద్రోహదినం పేరుతో తలపెట్టిన బహిరంగ సభలో పాల్గొనడానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు హైదరాబాద్‌కు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్ర సమితి మోసం చేస్తున్నాయని విమర్శిస్తూ బిజెపి ఈ బహిరంగ సభను బిజెపి నిర్వహిస్తోంది. తెలంగాణ వస్తుంది, బిజెపి తెస్తుంది అనే నినాదంతో బిజెపి ఈ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఘన స్వాగతం లభించింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. ఇంద్రసేనారెడ్డి, బిజెపి శాసనసభా పక్షం నాయకుడు జి. కిషన్‌ రెడ్డి, సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ ఆయనకు స్వాగతం చెప్పారు. అనంతరం రాజ్‌నాథ్‌ సింగ్‌ కాన్వాయ్‌లో మహబూబ్‌నగర్‌కు బయలుదేరారు. ఈ సభ సందర్భంగా పలువురు తెరాస కార్యకర్తలు తమ పార్టీలో చేరుతారని బిజెపి నాయకులు ఆశిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ నినాదం తమకు బలం చేకూరుస్తుందని కూడా వారు ఆశిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X