వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం పనులు ప్రారంభిస్తాం: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఏర్పడిన అడ్డంకులను అధిగమిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పులిచింతల పనులు ప్రారంభమైనట్లే పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి, కొవ్వూరుల మధ్య వంతెనకు ఆయన శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. మరో రెండు నెలల్లో పోలవరం ప్రాజెక్టు పనులు మొదలవుతాయని ఆయన చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికి ప్రతిపక్షాలు ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డుపడుతున్నాయని, వాటిని అధిగమిస్తామని ఆయన అన్నారు. పోలవరంతో మెట్ట ప్రాంతాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన అన్నారు. నాలుగు మాసాల్లో ప్రాజెక్టులకు చాలినన్ని అనుమతులు సాధించామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X