వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సికింద్రాబాద్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభం
హైదరాబాద్: సికింద్రాబాద్ ద్విశతాబ్ది ఉత్సవాలు శనివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. బుద్ధభవన్ నుంచి పరేడ్ గ్రౌండ్స్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ఉత్సవాలు జూన్ 11 వరకు నిర్వహిస్తారు. రెండు వందల ఏళ్ళ సికింద్రాబాద్ ఘన చరిత్రను ప్రపంచానికి చాటాలని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శనివారం ఉదయం సికింద్రాబాద్పై సావనీర్ను, డాక్యుమెంటరీని ఆవిష్కరించిన సందర్భంగా పిలుపు ఇచ్చారు. తపాలా శాఖ ప్రత్యేకంగా రూపొందించిన స్టాంపును, కవర్ను కూడా రాజశేఖరరెడ్డి ఆవిష్కరించారు.
Story first published: Saturday, June 3, 2006, 23:53 [IST]