వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేశవరావువి నిలకడ లేన మాటలు: తెరాస

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల్లో పొత్తు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పాకులాడుతోందని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్‌ కె. కేశవరావు చేసిన ప్రకటనపై తెరాస ప్రధాన కార్యదర్శి కె.యస్‌. రత్నం తీవ్రంగా మండిపడ్డారు. చులకన చేసి మాట్లాడడం, క్షణానికో విధంగా మాట్లాడటం కేశవరావుకు అలవాటుగా మారిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

తాము బలం ఉన్న చోట్ల పోటీ చేస్తామని, అవసరమైతే ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన అన్నారు. తెరాసతో పొత్తు పెట్టుకుంటామని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర రెడ్డి బహిరంగంగానే చెప్పారని, తమకు బలం లేకపోతే ముఖ్యమంత్రి ఎందుకు పొత్తు పెట్టుకుంటామని ఎందుకు చెబుతారని ఆయన అన్నారు. నిలకడ లేని మాటలు మాట్లాడటం, తెలంగాణను అపహాస్యం చేసే విధంగా మాట్లాడటం కేశవరావుకు తగదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X