వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరానికి తొందరేమి, దేవాదుల కావాలి: సిపియం

By Staff
|
Google Oneindia TeluguNews

మెదక్‌: పోలవరం ప్రాజెక్టుకు తొందరేమీ లేదని, దాని నిధులను మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం ముందు దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయాలని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సిపియం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికల్లో సర్దుబాట్లు చేసుకుంటామంటూనే కాంగ్రెస్‌ కాలయాపన చేస్తోందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే లోగా సర్దుబాట్లు పూర్తి కావాలని, సర్దుబాట్లు సక్రమంగా జరగకపోతే తాము తమ మిత్రులతో కలిసి ముందుకు పోతామని ఆయన కాంగ్రెస్‌ పార్టీని హెచ్చరించారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు పనులను ఆపించడంలో కూడా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ నెల 8,9,10 తేదీల్లో జరిగే పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో యుపిఎ ప్రభుత్వ పనితీరుపనై సమీక్ష జరుపుతామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X