వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బవారంట్‌ నుంచి డిజిపికి మినహాయింపు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఏలూరులో ఒక మైనర్‌ బాలిక అదృశ్యంపై రాష్ట్ర హైకోర్టు మంగళవారంనాడు రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) స్వరణ్‌జిత్‌ సేన్‌కు, పశ్చిమ గోదావరి జల్లా పోలీసు సూపరింటిండెంట్‌ (యస్పీ)కి, ఏలూరు సర్కిల్‌ ఇన్‌స్పెకర్టర్‌ (సిఐ)కి నాన్‌ బెయిలబుల్‌ వారంట్లు జారీ చేసింది. రాజమండ్రికి చెందిన గీతాదేవి అనే మహిళ దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ అప్పారావులతో కూడిన డివిజన్‌ బెంచీ ఆ వారంట్లు జారీ చేసింది. నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ నుంచి హైకోర్టు ఆనంతరం డిజిపికి మినహాయింపు ఇచ్చింది. కోర్టుకు స్వయంగా హాజరు కావాలని హైకోర్టు డిజిపికి, యస్పీకి, సిఐకి మొదట వారంట్‌ జారీ చేసింది.

గీతాదేవి అనే మహిళ తన కూతురు అదృశ్యంపై ఏప్రిల్‌ 1వ తేదీన ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే దానిపై ఏ విధమైన ఫలితం లభించలేదు. దీంతో గీతాదేవి ఏప్రిల్‌ 21వ తేదీన పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు ఆరు నెలల గడువు ఇచ్చింది. ఈ గడువు ముగిసినా కూడా ఆ యువతి జాడను పోలీసులు కనుక్కోలేకపోయారు. దీంతో హైకోర్టు డిజిపికి, యస్పీకి, సిఐకి వారంట్లు జారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X