వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖ జిల్లాలో ముగ్గురు మావోయిస్టుల హతం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా డొంకరాయి సమీపంలోని తంగన్న పేట పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టినప్పుడు ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. గాలింపు జరుపుతున్న తమకు మావోయిస్టులు ఎదురుపడ్డారని, తమను చూడగానే మావోయిస్టులు కాల్పులు జరిపారని, తాము ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు అంటున్నారు.
సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక ఎస్ఎల్ఆర్, 303 కార్బన్, కార్బయిడ్ స్వాధీనం చేసుకున్నారు. మరణించిన మావోయిస్టులు ఒరిస్సా, ఆంధ్ర సరిహద్దు దళానికి చెందినవారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Story first published: Saturday, June 17, 2006, 23:53 [IST]