వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దొంగల బీభత్సం: పెట్రోల్ బంకు దోపిడీ
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలోని ఎల్లంపేట ఒక పెట్రోల్ బంకులో దుండగులు స్వైర విహారం చేశారు. సిబ్బందిని బెదిరించి పెట్రోల్ బంకును దోచుకున్నారు. తుపాకులు ధరించిన ఐదుగురు దొంగలు టాటా సుమోలో వచ్చి సిబ్బందిని బెదిరించి ఒక గదిలో బంధించారు.
కాల్పులు జరుపుతూ వెనక నుంచి పెట్రోల్ బంకులోకి ప్రవేశించి దాదాపు 25 మంది ఉద్యోగులను గదిలో బంధించారు. అనంతరం దాదాపు 40 వేల నగదును దోచుకొని దొంగలు పారిపోయారు. దొంగలను ప్రతిఘటించడానికి సిబ్బంది ప్రయత్నించారు. అయితే దొంగలు కాల్పులు జరుపుతూ పారిపోయారు.
Comments
Story first published: Saturday, June 17, 2006, 23:53 [IST]