వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వెలుగోడు పనులు ఆడ్డుకున్న నిర్వాసితులు
ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు పనులను నిర్వాసితులు అడ్డుకున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించే వరకు పనులను సాగనివ్వమని వారు మొరాయించి కూర్చుకున్నారు. గొట్టిపడియ వద్ద ధర్నాకు దిగిన నిర్వాసితులు అక్కడే వంటావార్పూ చేసుకుంటున్నారు.
నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించే వెలుగోడు ప్రాజెక్టు నిర్మాణంలో 4,300 గ్రామాలు ముంపునకు గురవుతాయని అంచనా వేశారు. అయితే కొద్ది మందికి మాత్రమే నష్టపరిహారం ఖరారు చేసి చెల్లించారు. మిగతావారు తమకు నష్టపరిహారం చెల్లించాలని చేస్తున్న డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో గొట్టిపడియ, అక్కచెర్వు గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు.
Comments
Story first published: Saturday, June 17, 2006, 23:53 [IST]