వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జలయజ్ఞంతో తెలంగాణ, సీమల అభివృద్ధి: సియం

By Staff
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: జలయజ్ఞంతో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర రెడ్డి చెప్పారు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నిర్మించిన ఆనకట్టల వల్ల కోస్తా ప్రాంతం అభివృద్ధి చెందినట్లుగానే తాము చేపట్టిన జలయజ్ఞంతో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లా బసివికొండ వద్ద ఆయన మంగళవారం హంద్రీ - నీవా రెండో దశ పనులకు శంకుస్థాపన చేశారు.

హంద్రీ - నీవా రెండో దశను మూడు నాలుగేళ్లలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేస్తామని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లా మంచినీటి అవసరాలు తీర్చేందుకు కృష్ణా జలాలను తరలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇందిరమ్మ పథకం రెండో దశ కార్యక్రమానికి సర్వే ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X