వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్‌ యువతి అత్యాచారం కేసులో 5గురికి బెయిల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

అజ్మీర్‌: భారతదేశ సందర్శన కోసం వచ్చిన ఓ జపాన్‌ యువతిని రేప్‌ చేసిన కేసులో ఐదుగురికి రాజస్థాన్‌ హైకోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. అజ్మీర్‌లోని హోటల్‌ పుష్కర్‌లో జరిగిన ఈ సంఘటనలో పోలీసులు ఐదుగురిని ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. వీరిలో హోటల్‌ యజమాని కుమారుడు బబ్లు ప్రధాన ముద్దాయి కాగా, అతని తల్లి రోషిణి, సోదరుడు రాజు, సంజయ్‌, రాజు సాహి అరెస్టయిన వారిలో ఉన్నారు.

బబ్లు బెయిల్‌ ధరఖాస్తును పరిశీలించిన హైకోర్టు పూచీకత్తుపై అతనితోపాటు మిగిలిన నలుగురికి కూడా బెయిల్‌ మంజూరు చేసింది. ఏప్రిల్‌ 2న జరిగిన ఈ సంఘటన గురించి 18వ తేదీన జపాన్‌ యువతి ఫ్యాక్స్‌ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. బబ్లు 54 వేల రూపాయల నగదును కూడా దోచుకున్నట్లు ఆమె అప్పట్లో ఫిర్యాదు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X