వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య గుడిని కాపాడిన పోలీసులకు మోడీ బహుమతి

By Staff
|
Google Oneindia TeluguNews

గాంధీనగర్‌: అయోధ్య రామమందిరం ప్రాంగణంపై దాడిని తిప్పికొట్టిన ఉత్తరప్రదేశ్‌ సాయుధ కాన్‌స్టేబ్యులరీ సిబ్బందికి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఒకొక్కరికి మూడు లక్షల రూపాయల పారితోషికాన్ని అందజేశారు. 2005 జనవరి 5న తీవ్రవాదులు అయోధ్య రామమందిరంపై దాడికి ప్రయత్నించారు. ఈ డబ్బు ఉత్తరప్రదేశ్‌ పోలీసు ప్రధాన కార్యాలయానికి చేరిందని, దీనిని త్వరలో సంబంధిత సిబ్బందికి అందజేస్తామని యుపి పోలీసు వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా మార్చి 7న వారణాసిలోని సంకట్‌ మోచన్‌ ఆలయం, కంటోన్మెంట్‌ రైల్వే స్టేషన్లపై జరిగిన పేలుళ్ళ కేసును విచారించిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి రెండు లక్ష్ల రూపాయల చొప్పున పారితోషికం ఇవ్వవలసిందిగా ఉత్తరప్రదేశ్‌ పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌కు సిఫార్సు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X