వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జీతం ఇవ్వలేదని అధికారిని చంపిన ఉద్యోగి
ఒంగోలు: ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డబ్లుఎస్ కార్యాలయంలో ఎన్ఎంఆర్గా పనిచేస్తున్న హనుమారెడ్డి తన పై అధికారి, అసిస్టెంట్ ఇంజినీర్ హేమేంద్రరావును హత్య చేశాడు. తనకు రెండు నెలలుగా జీతం ఇవ్వడం లేదన్న కక్షతో హనుమారెడ్డి బండ రాయితో హేమేంద్రరావును హత్యచేశాడు. తనకు జీతం ఇవ్వమని అడిగిన హనుమారెడ్డి మాటా మాటా పెరగడంతో దగ్గర్లో ఉన్న రాయిని తీసుకుని హేమేంద్రరావు తలపై విసిరేశాడు. తీవ్రంగా గాయపడిన ఎఇ హేమేంద్రరావు అక్కడికక్కడే మరణించాడు. తర్వాత హనుమారెడ్డి మార్కాపురం పోలీసు స్టేషన్కు వెళ్ళి లొంగిపోయాడు.
Comments
Story first published: Wednesday, June 7, 2006, 23:53 [IST]