వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కొండగట్టులో ట్రాక్టర్ బోల్తా: 5గురు మృతి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కొండగట్టు దేవస్థానం ఘాట్రోడ్డుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది.
కొండగట్టు దేవస్థానంలో దైవదర్శనం చేసుకొని వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తాపడింది. ఆ సమయంలో ట్రాక్టర్లో 30 మంది ప్రయాణిస్తున్నారు. మృతులు, క్షతగాత్రులు తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామానికి చెందినవారు.
Comments
Story first published: Thursday, June 8, 2006, 23:53 [IST]