వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిపియం నేత కారత్‌తో కేశవరావు భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సిపియం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌తో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్‌ కె. కేశవరావు గురువారం ఉదయం కలిశారు. పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొనడానికి కారత్‌ హైదరాబాద్‌ వచ్చారు. కేశవరావు ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో సిపియం కార్యాలయానికి వెళ్లి కారత్‌ను కలుసకున్నారు. ఇరువురి మధ్య దాదాపు ఐదు నిమిషాల పాటు సంభాషణ జరిగింది.

కారత్‌ను మర్యాదపూర్వకంగా మాత్రమే కలుసుకున్నానని కేశవరావు సమావేశనాంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అతిథులు వచ్చినప్పుడు కలవడం మర్యాద అని ఆయన అన్నారు. సమావేశం వివరాలను వెల్లడించడానికి కారత్‌ నిరాకరించారు. కారత్‌ను కేశవరావు మళ్లీ ఈ సాయంత్రం కలిసే అవకాశాలున్నాయి. కేశవరావుతో పాటు సమావేశంలో కాంగ్రెస్‌ శాసనసభ్యుడు టి. జీవన్‌రెడ్డి కూడా ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X