వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక స్త్రీని దోచుకున్న ఆటో డ్రైవర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కర్ణాటకకు చెందిన ఒక మహిళను మోసం చేసి ఆటో డ్రైవర్‌ ఒకతను ఆమె వద్ద నగలను, నగదును దోచుకున్నాడు. తన కూతురును చూడడానికి వచ్చిన కర్ణాటకకు చెందిన స్నేహలతా పాండే హైదరాబాద్‌ వచ్చారు. రైల్వే స్టేషన్‌ నుంచి హైదరాబాద్‌లోని బర్కత్‌పూరాకు ఆటోను మాట్లాడుకున్నారు. తన ఆటోలో ఆ మహిళను ఎక్కించుకున్న డ్రైవర్‌ మోసం చేశాడు.

అతను ఆటోను బర్కత్‌పురాకు కాకుండా నేరుగా లాలాగూడాకు తీసికెళ్లాడు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఆటోను ఆపేసి ఆ మహిళను దింపి ఆమె వద్ద ఉన్న బంగారు నగలను, పది వేల రూపాయల నగదను దోచుకుని పారిపోయాడు. ఈ విషయమై స్నేహలతా పాండే లాలాగూడా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X