వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కానిస్టేబుల్ను కాల్చి చంపిన మావోయిస్టులు
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం జావాపల్లి గ్రామంలో మావోయిస్టులు రమేష్ అనే కానిస్టేబుల్ను కాల్చి చంపారు. మావోయిస్టు యాక్షన్ టీమ్కు చెందిన నలుగురు నక్సలైట్లు జావాపల్లి గ్రామంలో రమేష్పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్ జావాపల్లి వెళ్లి తిరిగి కొల్లాపూర్ పోలీసు స్టేషన్కు తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. రమేష్ జావాపల్లి ఎందుకు వెళ్లాడనే విషయం తెలియదు.
Comments
Story first published: Monday, June 12, 2006, 23:53 [IST]