వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాకు కాంగ్రెస్‌ ప్రాధాన్యం ఇవ్వలేదు: సిపియం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సీట్ల సర్దుబాటులో తమకు ప్రాధాన్యం ఇవ్వనందుకే కాంగ్రెస్‌తో విడిపోయామని సిపియం నేత, శాసనసభ్యుడు తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, సిపిఐలతో తాము పొత్తులకు సుముఖంగానే ఉన్పప్పటికీ కాంగ్రెస్‌ తమ బలాన్ని తక్కువ అంచనా వేసిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్‌ తమకు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన అన్నారు.

ప్రజాసమస్యలపై తాము పోరాటాలు చేస్తూనే ఉంటామని, అయితే యుపిఎకు తమ మద్దతు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ తమకు ఖమ్మం, నల్లగొండ జిల్లా పరిషత్తులు ఇవ్వడానికి ముందుకు వచ్చిందని, ఆ మద్దతును తీసుకోకుండా ఉండడం సాధ్యం కాదని ఆయన అన్నారు. తమకు కాంగ్రెస్‌ పట్టుకుని వేళ్లాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X