వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసు ఇంట్లోనే దొంగతనం: బంగారం స్వాహ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో దొంగతనాల పరంపర ఆగడం లేదు. పోలీసు ఇంటిలోనే ఆదివారం రాత్రి దొంగతనం జరిగింది. పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) కార్యాలయం పక్కనే ఉన్న పోలీసు క్వార్టర్స్‌లో దొంగలు పడి 50 తులాల బంగారం ఎత్తుకుపోయారు. సోమన్న అనే పోలీసు అధికారికి ఇటీవల కడప జిల్లాకు బదిలీ అయింది. ఆయన విధుల నిర్వహణ కోసం కడప జిల్లాకు వెళ్లారు.

ఆయన కుటుంబ సభ్యులు తమ బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం వచ్చి చూసేసరికి ఇంట్లో దొంగతనం జరిగింది. 50 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు ఇంటి యజమానురాలు మల్లీశ్వరి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X