వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలీసు ఇంట్లోనే దొంగతనం: బంగారం స్వాహ
హైదరాబాద్: హైదరాబాద్లో దొంగతనాల పరంపర ఆగడం లేదు. పోలీసు ఇంటిలోనే ఆదివారం రాత్రి దొంగతనం జరిగింది. పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) కార్యాలయం పక్కనే ఉన్న పోలీసు క్వార్టర్స్లో దొంగలు పడి 50 తులాల బంగారం ఎత్తుకుపోయారు. సోమన్న అనే పోలీసు అధికారికి ఇటీవల కడప జిల్లాకు బదిలీ అయింది. ఆయన విధుల నిర్వహణ కోసం కడప జిల్లాకు వెళ్లారు.
ఆయన కుటుంబ సభ్యులు తమ బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం వచ్చి చూసేసరికి ఇంట్లో దొంగతనం జరిగింది. 50 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు ఇంటి యజమానురాలు మల్లీశ్వరి చెప్పారు.
Comments
Story first published: Monday, June 12, 2006, 23:53 [IST]