రాష్ట్రంలో ధర్నాలు, రైల్రోకోలు, అరెస్టులు
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం, సిపియంలు మంగళవారం ఆందోళనకార్యక్రమాలు చేపట్టాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైల్రోకోలు, ధర్నాలు నిర్వహించాయి. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో సైకిల్ ర్యాలీ నిర్వహించింది. హైదరాబాద్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు, తెలుగుదేశం శాసనసభ్యుడు సాయన్న, హైదరాబాద్ నగర మేయర్ తీగల కృష్ణారెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్లోని లిబర్టీ సెంటర్ వద్ద ధర్నా చేస్తున్న సిపిఐ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కడపలో తెలుగుదేశం నాయకులు ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడాలో తాళ్లు కట్టి లారీలను లాగుతూ ఆందోళనకారులు ప్రదర్శన నిర్వహించారు. నల్లగొండ జిల్లాలో రైల్రోకో నిర్వహించిన సిపియం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డితో పాటు 70 మందిని పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో లారీల బంద్ పాక్షికంగా విజయవంతమైంది. కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకొని తెలుగుదేశం పార్టీతో పంచాయతీ ఎన్నికల్లో జత కట్టడానికి సిద్ధమైన సిపియం ఆ పార్టీతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది.