వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ పాలనపై రైతు రాజ్యం సిడి విడుదల
హైదరాబాద్: ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి శాసనసభ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై, ఆ తర్వాత రెండేళ్లలో వాటిని అమలు చేయడంపై రైతు రాజ్యం పేరుతో రూపొందిన సిడి విడుదలైంది. మాజీ శాసనసభ్యుడు రేపాల శ్రీనివాస్ రూపొందించిన ఈ సిడిని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి శుక్రవారం ఎడ్లబండిపై ఆవిష్కరించారు. 23 నిమిషాల నిడివి గల ఈ సిడిలో వివిధ ప్రభుత్వ పథకాలను చేర్చారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి సిడి ఆవిష్కరణ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రంలో ఒక్క ఎకరా పంట కూడా ఎండిపోకుండా చూశామని ఆయన చెప్పారు. వెనకబడిన తరగతుల వృత్తుల రక్షణకు చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. గ్రామీణ ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచేందుకు తాము పథకాలు అమలు చేస్తున్నామని, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, June 16, 2006, 23:53 [IST]