వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్లోకి తెరాసవారు వస్తామంటే వద్దనం: వైయస్
హైదరాబాద్: కాంగ్రెస్ మహాసముద్రంలాంటిదని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు, కార్యకర్తలు వచ్చి చేరుతామంటే వద్దనేది లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. తెరాసకు, తెలుగుదేశం పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలు శుక్రవారం వైయస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తమ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్లో చేర్చుకోకూడదని తెరాస నాయకుడు ఎ. నరేంద్ర చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి తనదైన శైలిలో ప్రతిస్పందించారు. తెరాస కార్యకర్తలు కాంగ్రెస్లో చేరుతామంటే వద్దనేది లేదని, అటువంటి విషయంలో అధిష్ఠానవర్గానికి భయపడేది లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమమని, కాంగ్రెస్లో చేరడమంటే జాతీయ జన జీవన స్రవంతిలో కలవడమని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, June 16, 2006, 23:53 [IST]