వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శ్రీలంకలో 20 మంది టైగర్ల హతం
కొలంబో: శ్రీలంక సైన్యానికి, ఎల్టిటిఇకి మధ్య జరుగుతున్న పోరులో శనివారం 20 మంది టైగర్లు, నలుగురు నావికులు మృతి చెందారు. ఉభయ పక్షాల మధ్య నీటిమీద, నేల మీద భీకర పోరు సాగుతోంది. గత వారం ఎల్టిటిఇ తీవ్రవాదులు ఒక బస్సుపై దాడి చేసి అనేక మంది ప్రాణాలు తీసినందుకు ప్రతీకారంగా శ్రీలంక సైన్యం భారీ కూంబింగ్ ప్రారంభించింది. బస్సు పేల్చివేతలో మరణించిన వారి అంత్యక్రియలు నిన్న శుక్రవారం అనురాధ పురంలో జరిగాయి. దీనితో శ్రీలంకలోని వివిధ ప్రాంతాల్లో సామాన్య ప్రజల్లో టైగర్ల మీద ఆగ్రహం పెల్లుబుకుతోంది.
Comments
Story first published: Saturday, June 17, 2006, 23:53 [IST]