వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్-సిపిఐ పొత్తు చర్చలు విఫలం
హైదరాబాద్: స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పొత్తు కోసం కాంగ్రెస్-సిపిఐల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. పిసిసి అధ్యక్షుడు కె కేశవరావు ఇంట్లో శనివారం సిపిఐ సీనియర్ నాయకుడు సురవరం సుధాకరరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చర్చలు జరిపారు. సిపిఐ కోరినన్ని స్ధానాలు ఇవ్వడానికి కాంగ్రెస్ సుముఖంగా లేకపోవడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. తమకు బలం ఉందనుకున్న అన్ని స్ధానాల్లోనూ నామినేషన్లు వేయాలని సిపిఐ నిర్ణయించుకుంది. కాంగ్రెస్ తీరుపై సిపిఐ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Comments
Story first published: Saturday, June 17, 2006, 23:53 [IST]