వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇలాగైతే ఈ ఎన్నికలెందుకు?- చంద్రబాబు
హైదరాబాద్: స్ధానిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని రీతిలో అధికార దుర్వినియోగం జరుగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఇక్కడ విమర్శించారు. రాష్ట్ర మంత్రులు బరితెగించి అధికార దుర్వినియోగానికి పాలడుతున్నారని ఆయన ఆరోపించారు. అక్రమాల ద్వారా గెలిచేందుకు కాంగ్రెస్ నాయకులు భారీ వ్యూహమే రచించుకున్నారని ఆయన అన్నారు. ఇన్ని అక్రమాలతో ఎన్నికలు జరిపించడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. నామినేషన్లు వేయడానికి వెళ్తున్న తెలుగుదేశం అభ్యర్ధులను కాంగ్రెస్ వారు బెదిరించారని చంద్రబాబు నాయుడు అన్నారు. కాంగ్రెస్ వారే అన్ని స్ధానాల్లో నామినేషన్లు వేసుకుంటే సరిపోతుంది కదా అని ఆయన విమర్శించారు.
Comments
Story first published: Saturday, June 17, 2006, 23:53 [IST]