వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్ధానిక ఎన్నికల సందర్భంగా పలువురికి గాయాలు
కరీంనగర్: స్ధానిక సంస్ధల నామినేషన్ల దాఖలుకు ఆఖరు రోజైన శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో నామినేషన్లు వేయడానికి వస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కార్యకర్తల ట్రాక్టర్లు ఢీకొనడంతో 30 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్ధితి ఆందోళనకరంగా ఉండడంతో వరంగల్లోని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. అనంతపురం జిల్లాలోను మూడు నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్, టిడిపి వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. బెళగుప్ప మండలంలో ఉభయ పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Story first published: Saturday, June 17, 2006, 23:53 [IST]