వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలీసుల ముట్టడిలో మాధవ్, శాఖమూరి?
హైదరాబాద్: ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య పెద్ద సమరం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా నల్లమల అడవుల్లో ఆశ్రయం పొందినట్టు భావిస్తున్న రాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావు ఉంటున్న ప్రదేశం చుట్టూ పోలీసులు మోహరించి ముందుకు కదులుతున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి పోలీసు కాల్పుల్లో మరణించిన మావోయిస్టు నాయకుడు రవికుమార్ వీరిద్దరికీ సెంట్రీగా ఉన్నట్టు ఒక కథనం బయటికి వచ్చింది. రవి వంటి అగ్రనేత సెంట్రీ డ్యూటీ చేస్తున్నాడంటే అంతకంటే పెద్ద నేతలు అక్కడ సమావేశమై ఉంటారని ఊహించిన పోలీసులు ముట్టడిని ముమ్మరం చేశారు.
Comments
Story first published: Saturday, June 17, 2006, 23:53 [IST]