వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అసంతృప్తితోనే కాంగ్రెస్ సర్దుబాట్లు: సిపిఐ
హైదరాబాద్: అసంతృప్తితోనే కాంగ్రెస్తో పంచాయతీ ఎన్నికల్లో అవగాహనకు వచ్చామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. విశాఖపట్నం, మెదక్ జిల్లాల్లో సర్దుబాట్లు సాధ్యం కాలేదని, ఈ జిల్లాల్లో కాంగ్రెస్తో స్నేహపూర్వక పోటీ ఉంటుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఈ రెండు జిల్లాల్లో సర్దుబాటు కుదరలేదని ఆయన అన్నారు.
సిపిఐ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి, నారాయణ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి సమక్షంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు కె. కేశవరావుతో చర్చలు జరిపారు. ఎనిమిది జిల్లాల్లో సర్దుబాట్లు కుదిరాయని చర్చల అనంతరం నారాయణ చెప్పారు.
Comments
Story first published: Monday, June 19, 2006, 23:53 [IST]