మావోయిస్టు ప్లాటూన్ కమాండర్ హతం
గుంటూరు: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు ప్లాటూన్ కమాండర్ సురేష్ మరణించాడు. గుంటూరు జిల్లా పుల్లెలచెరువులో సురేష్ను పోలీసులు అరెస్టు చేసి కాల్చి చంపారని ప్రజా సంఘాలు ఆరోపించాయి. తమ కొడుకును పట్టుకెళ్లి పోలీసులు కాల్చి చంపారని సురేష్ తల్లిదండ్రులు కూడా అంటున్నారు. పదేళ్ల క్రితం చెడు సావాసాలు పట్టి తమ కుమారుడు నక్సలైట్లలో చేరాడని వారంటున్నారు.
రాష్ట్రంలో గత నాలుగైదు రోజులుగా వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లలో ఒకరో ఇద్దరో మావోయిస్టులు మరణించడం ఆనవాయితీగా మారింది. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మట్టా రవికుమార్ హతం కావడం నక్సలైట్లకు పెద్ద దెబ్బ. రవికుమార్ ఎన్కౌంటర్ విషయంలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.