వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెంపుడు తల్లి వద్దనే నిఖిత: మహిళా కమీషన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఇద్దరు తల్లుల మధ్య నలిగిపోతున్న నిఖిత కేసును మహిళా కమీషన్‌ తాత్కాలికంగా పరిష్కరించింది. నిఖితను తాత్కాలికంగా పెంపుడు తల్లి వద్దనే ఉంచాలని మహిళా కమీషన్‌ ఆదేశించింది. కన్నతల్లి అప్పుడప్పుడు వచ్చి నిఖితను చూడవచ్చునని కమీషన్‌ తెలియజేసింది. నిఖిత కన్నతల్లి నజియాభాను మానసిక స్థితి అంచనా వేయడానికి వైద్య పరీక్షలు నిర్వహించాలని, వైద్య పరీక్షల అనంతరమే నిఖిత విషయమై నిర్ణయం తీసుకుంటామని కమీషన్‌ తెలియజేసింది.

నిఖిత వంటి కేసులు ఇక ముందు జరిగితే పిల్లలను శిశు సంరక్షణా కేంద్రాలకు తరలించాలని కమీషన్‌ నిర్ణయించింది. నజియాభాను నిఖితను వదిలేయడంతో మరో తల్లి ఆమెను పెంచుకుంటోంది. ఇప్పుడు తన కూతుర్ని తనకు అప్పగించాలంటూ నజియాభాను ముందుకు వచ్చింది. నిఖితకు సంబంధించి దత్తత పత్రాలు లేకపోవడంతో వివాదం కొలిక్కి రావడం గగనంగా తయారైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X