వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
డియస్పీ ఇళ్లలో ఎసిబి అధికారుల సోదాలు
హైదరాబాద్: మెదక్ జిల్లా రామచంద్రాపురం డియస్పి శేషగిరి ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ ( ఎసిబి) అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు. బుధవారం ఉదయం జరిపిన ఈ దాడుల్లో ఎసిబి అధికారులు డియస్పీకి చెందిన 38 లక్షల రూపాయల విలువ చేసే అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
బియచ్ఇయల్లోని క్వార్టర్స్లో, సికింద్రాబాద్లోని ఆయన సొంత ఇంట్లో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్లోని అశోక్నగర్లో గల ఆదిశేషగిరిరావు కూతురు ఇంటిలో కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. నగలు, నగదుతో పాటు పది లక్షల రూపాయల విలువ చేసే బాండ్లు, లగ్జారంలో విలువైన భూములు ఉన్నట్లు ఎసిబి సోదాల్లో తేలింది.
Comments
Story first published: Wednesday, June 21, 2006, 23:53 [IST]