వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నేను పక్షపాతంతో వ్యవహరించలేదు: ఎవియస్ రెడ్డి
హైదరాబాద్: తాను ఏనాడూ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించలేదని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎ.వి.యస్. రెడ్డి స్పష్టం చేశారు. ఆ విషయం తన అంతర్మాతకు తెలుసునని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అవకతవకలపై తాము ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నామని ఆయన చెప్పారు. తాము ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ విమర్శించడం బాధ్యతారాహిత్యమని, దానికి తానేమీ చేయలేనని ఆయన అన్నారు.
ఎన్నికల కమీషన్ పక్షపాతంతో వ్యవహరించడం లేదని, తప్పొప్పులన్నింటికీ తమనే బాధ్యులను చేయడం సరి కాదని ఆయన అన్నారు. రాజ్యాంగం ప్రకారం తాము స్వతంత్రంగా వ్యవహరిస్తున్నామని ఆయన చెప్పారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తాజా ఆదేశాల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రేపటి డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని బట్టి తాము తదుపరి ప్రక్రియపై వ్యవహరిస్తామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Wednesday, June 21, 2006, 23:53 [IST]