వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఖమ్మం జిల్లాలో ఇద్దరు మావోయిస్టుల హతం
హైదరాబాద్: ఖమ్మం జిల్లా చింతూరు మండలం ఎడుగురాళ్లపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ మరణించారు. బుధవారం మధ్యాహ్నం వరకు కూడా ఎన్కౌంటర్ జరుగుతూనే ఉంది. బుధవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు నక్సల్స్ ఎదురుపడ్డారు. ఈ సమయంలో ఇరు పక్షాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది.
మృతుల్లో ఒక మహిళా నక్సలైట్ కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరో మృతుడు మావోయిస్టు జిల్లా కమిటీ కార్యదర్శి జగదీష్ అయి వుండవచ్చునని అనుమానిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా ఈర్లపెంట వద్ద కూడా మావోయిస్టులకు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అదే విధంగా విజయనగరం జిల్లాలోని ఒరిస్సా - ఆంధ్రా సరిహద్దుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య మరో ఎన్కౌంటర్ జరిగింది.
Comments
Story first published: Wednesday, June 21, 2006, 23:53 [IST]