సుధాకర్ను కోర్టులో హాజరు పరచండి: హైకోర్టు
హైదరాబాద్/విజయనగరం: కొడుకు ఆచూకీ కోసం మావోయిస్టు ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దు కమిటీ కార్యదర్శి సుధాకర్ తల్లి హైకోర్టు గురువారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. కాగా, సుధాకర్ ఒరిస్సా రాష్ట్రంలోని గజపతి జిల్లాలో క్షేమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మక్కువ పోలీసుల ఆదపులో ఒక మావోయిస్టు ఉన్నాడని, అయితే అతను సుధాకర్ కాడని విజయనగరం జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) అంటున్నారు. మావోయిస్టు అగ్రనేత సుధాకర్ను రేపటిలోగా కోర్టుకు హాజరు పరచాలని లేదా సుధాకర్కు సంబంధించిన అన్ని వివరాలను తెలియజేయాలని హైకోర్టు గురువారం రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ను ఆదేశించింది. సుధాకర్ తల్లి పార్వతమ్మ వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది.
సుధాకర్ బంధువులు కృష్ణమూర్తి, ఉమాదేవి దంపతులను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయనగరం జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్కు ముందే కృష్ణమూర్తి దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. సుధాకర్కు తమ కదలికలకు సంబంధించిన సమాచారాన్ని కృష్ణమూర్తి దంపతులు అందిస్తున్నారనేది పోలీసులు ఆరోపణ.