వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒత్తిడి వల్లనే తప్పులు: రెవెన్యూ ఉద్యోగుల సంఘం
హైదరాబాద్: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు ఎం. లక్ష్మయ్య అన్నారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలకు తమను బాధ్యులను చేస్తే సహించబోమని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ కార్యదర్శి లేకపోవడం వల్ల కూడా ఈ అవకతవకలకు అవకాశం కలిగిందని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ కార్యదర్శులను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Story first published: Thursday, June 22, 2006, 23:53 [IST]