రిజర్వేషన్లు ఉండాల్సిందే: మీరాకుమార్
న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ల అంశం మళ్లీ చర్చకు వచ్చింది. దేశాభివృద్ధికి రిజర్వేషన్లు తప్పనిసరిగా ఉండాలని కేంద్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి మీరా కుమార్ అన్నారు. శుక్రవారం నాడిక్కడ విదేశాల్లో చదువుకునే షెడ్యూల్ కులాల విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేసే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర వెనుకబడిన వారికి ఉన్నత విద్యలో అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు.
ఉన్నత విద్యలో వెనుకబడిన కులాల వారికి అధిక కల్పించడం ఒక్కటే రిజర్వేషన్ల ఉద్ద్యేశ్యం కాదని, దేశాభివృద్ధికి రిజర్వేషన్ల కల్పన తప్పనిసరి అని ఆమె అన్నారు. గతంలోనూ, వర్తమాన ంలోనూ వెనుకబడిన కులాలు విద్యాభ్యాసంలో తమకు కల్పించిన హక్కులను పొందలేకయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యలో వెనుకబడిన కులాల ప్రాతినిథ్యం పెంచాల్సిన అవసరముందని ఆమె ఆన్నారు.