వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎమ్మిగనూరులో మిద్దె కూలి నలుగురు మృతి
కర్నూలు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మిద్దె కూలి నలుగురు మరణించారు. శనివారం తెల్లవారు జామున మూడు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. భారీ వర్షానికి మట్టి మిద్దె కూలిపోయింది. ముస్లిం వీధిలోని ఒక పేద కుటుంబానికి చెందిన నలుగురు ఈ ప్రమాదంలో మరణించారు. ఈ సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు. మృతుల కుటుంబానికి స్ధానిక ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తన వంతు సాయంగా పదివేల రూపాయలను అందజేశారు.
Comments
Story first published: Saturday, June 24, 2006, 23:53 [IST]