వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరోగ్య అత్యసవర స్ధితి విధించాలి: చంద్రబాబు

By Sridhar L
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర స్ధితి ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. చికున్‌ గన్యా వ్యాధి రాష్ట్రంలో తీవ్రరూపం దాల్చిందని, ఈ వ్యాధి తీవ్రతపై ఆరోగ్యశాఖ మంత్రి రోశయ్య బాధ్యతారహిత ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. గన్యా జ్వరాలపై ప్రజల్లో అవ గాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా

విఫలమైనందని ఆయన ఆరోపించారు. కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలికమైన మందులు లేవని ఆయన అన్నారు. తమ హయాంలో ఇటువంటి వ్యాధులు తీవ్రంగా వచ్చినప్పుడు ఆరోగ్య అత్యవసర పరిస్ధితి విధించామని చంద్రబాబు గుర్తు చేశారు. చికున్‌ గన్యా వ్యాధి ఎక్కువగా తెలుగుదేశం వారికి సోకిందేమోనని రోశయ్య జోకులు వేయడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X